హైదరాబాద్: ఉద్యోగార్థలు ఎదురుచూస్తోన్న ఆర్ఆర్బి పరీక్షల వివరాలు, భర్తీ ప్రక్రియను రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ ప్రకటించింది. ఎన్టీపిసి, ఐసోలేటెడ్ అండ్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఈనెల 15 నుంచి ప్రారంభంమవుతాయని రైల్వే బోర్డు మానవ వనరుల విభాగం డైరెక్టర్ జనరల్ ఆనంద్ సింగ్ ఖాతీ వెల్లడించారు. మొత్తం 1.4 లక్షల పోస్టులకు సంబంధించి మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ను ఆర్ఆర్బీ నిర్వహించనున్నది.
మొత్తం మూడు దశల్లో ఈ నియామక ప్రక్రియ ఉండనుంది. మొదటి దశలో ఐసొలేడెట్ అండ్ మినిస్టీరియల్ క్యాటగిరీ ఉద్యోగాల భర్తీకి కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తారు. రెండో దశలో నాన్ టెక్నికల్ పాపులర్ క్యాటగిరీ (ఎన్టీపిసి) పరీక్ష ఈ నెల 28 నుంచి మార్చి 2021 వరకు జరుపుతారు. మూడో దశలో లెవల్–1 సిబిటి పోస్టులకు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్లో దేశవ్యాప్తంగా మొత్తం 2.44 కోట్ల మంది పాల్గొంటారని రైల్వేశాఖ అంచనా వేస్తున్నది. సికింద్రాబాద్ జోన్కు సంబంధించి మొదటి దశలో 95 పోస్టుల భర్తీకి 18 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షల కోసం మొత్తం 6,138 మంది దరఖాస్తు చేసుకున్నారు. నాన్ టెక్నికల్ పాపులర్ క్యాటగిరీలో 3,234 ఖాళీలను భర్తీ చేయనుండగా 11 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు.
సిఇఎన్ నెం పోస్ట్ పేరు ఖాళీలు వచ్చిన దరఖాస్తులు పరీక్ష తేదీలు
03/2019 ఐసోలేటెడ్, మినిస్టీరియల్ కేటగిరి 1,663 1.03 లక్షలు డిసెంబర్ 15-18
01/2019 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ 35,208 1.26 కోట్లు డిసెంబర్ 28 నుంచి మార్చి2021 వరకు
ఆర్ఆర్ సి లెవెల్-1 1,03,769 1.15 కోట్లు ఏప్రిల్ నుంచి జూన్ వరకు 01/2019