యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్చరణ్లతో దర్శక ధీరుడు రాజమౌళి ‘రౌద్రం రణం రుధిరం’ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం షూట్కు సంబంధించి ఫిల్మ్మేకర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ను ఇస్తూ వస్తున్నారు. మరి ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి భారీ క్లైమాక్స్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్న మేకర్స్ లేటెస్ట్గా ఒక కూల్ పోస్ట్ను తమ ఫాలోవర్స్తో పంచుకున్నారు. భీమ్గా చేస్తున్న తారక్, అల్లూరిగా చేస్తున్న చరణ్ల ఆన్ లొకేషన్ ఫొటోలతో ఒక పోస్ట్ పెట్టారు. భారీ క్లైమాక్స్ సీన్ కోసం తీవ్రంగా కష్టపడి ఆ సెషన్ నుంచి వీరిద్దరూ కాస్త బ్రేక్ తీసుకున్నారని తెలియజేశారు.
ఈ సందర్భంగా చిరునవ్వులు చిందిస్తున్న తారక్, చెర్రీ ఫొటోలను చిత్ర బృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరి ఇప్పటికే క్లైమాక్స్ సీన్ను మైండ్ బ్లోయింగ్ విజువల్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్లతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్గణ్, అలియా భట్లు కీలక పాత్రల్లో నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. డివివి దానయ్య 400 కోట్లకు పైగా వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కొనసాగుతోంది.