Saturday, April 20, 2024

 రాయికల్ టోల్ ప్లాజా వద్ద భారీగా బంగారం పట్టివేత..

- Advertisement -
- Advertisement -

Gold Seized

 

హైదరాబాద్: నగర జోనల్ యూనిట్ స్పెషల్ తనిఖీల్లో 1.38 కోట్ల విలువ గల బంగారం పట్టుబడింది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఓ ప్రైవేట్‌ బస్సులో అక్రమంగా బంగారం తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న డైరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిజెన్స్‌(డిఆర్‌ఐ అధికారులు) నగర శివారులోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద బస్సును అడ్డగించి, సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నలుగురు వ్యక్తుల వద్ద 3.09 కిలోల బంగారం లభించింది. బస్సు లో ఉన్న బంగారం స్మగ్లర్ల కు ఎస్కార్ట్ గా మరో వాహనంలో వెళ్లిన వ్యక్తులు పరారయ్యారు. డిఆర్‌ఐ అధికారులు స్మగ్లర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Rs 1.38 cr worth Gold Seized at Raikal Toll plaza

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News