Thursday, March 28, 2024

కరోనా అమరవీరుని కుటుంబానికి రూ. కోటి సాయం

- Advertisement -
- Advertisement -

Rs 1 crore aid to Family of Lab Technician who died of Corona

 

న్యూఢిల్లీ : కరోనా రోగుల వైద్య సేవలో కరోనా సోకి మృతి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ కుటుంబానికి రూ. కోటి సాయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ శనివారం అందజేశారు. ఢిల్లీ లోని హిందూరావు ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసే రాకేష్ జైన్ కరోనా సోకడంతో గత ఏడాది జూన్ 17న చికిత్స పొందుతూ మృతి చెందారు. కరోనా రోగుల సేవకే జైన్ అంకితమయ్యారని కేజ్రీవాల్ గుర్తు చేసుకున్నారు. ఆయన తల్లి, భార్య, పిల్లలను కలుసుకుని రూ. కోటి సాయం అందజేశారు. ఆయన కుమారునికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News