- Advertisement -
న్యూఢిల్లీ : కరోనాతో మృతి చెందిన ఎల్ఎన్జెపి ఆస్పత్రి సీనియర్ డాక్టర్ కుటుంబానికి సోమవారం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రూ. కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. సమాజం సమర్ధుడైన డాక్టర్ను కోల్పోయిందని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా వైద్య చికిత్సలో ముందుండే డాక్టర్ అసీమ్ గుప్తా (52) కరోనాకు గురై ప్రైవేట్ ఆస్పత్రి ఐసియులో ఆదివారం మృతి చెందారు. గుప్తా భార్య కూడా డాక్టర్. ఆమెకు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు.
- Advertisement -