హైదరాబాద్ : ఒకే వ్యక్తి ఒక శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) కలిగి ఉండాలనే నిబంధనను అతిక్రమించిన వ్యక్తులపై ఆదాయపు పన్ను శాఖ చర్యలను తీసుకోనుంది. ఒకటికంటే ఎక్కువ పాన్కార్డులను కలిగిన వారికి రూ.10వేల జరిమానా విధించాలని నిర్ణయించింది. అయితే వివిధ కారణాల వల్ల ఒకటికన్నా ఎక్కువ పాన్కార్డులను కలిగి ఉన్నవారు.. తమ వద్ద అదనంగా పాన్కార్డులను తిరిగి ఇవ్వడం ద్వారా ఇబ్బందుల నుంచి తప్పించుకునే అవకాశాన్ని ఆదాయపు పన్ను శాఖ కల్పించింది. ఒకటి కన్నా ఎక్కువ కార్డులు ఉంటే వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఎన్నారైలు ఈ విధంగా ఎక్కువ పాన్కార్డులను కలిగి ఉంటారు. భారత్ను వీడి వెళ్లక ముందు వీరికి ఒకే పాన్కార్డు ఉంటుంది.
ఆపైన కొన్ని సంవత్సరాల అనంతరం స్వదేశానికి మళ్లీ వచ్చినప్పడు వారు మరో పాన్కార్డును తీసుకుంటారు. అంతేకాకుండా తమ పాన్కార్డులో ఉన్న వివరాల్లో తప్పులు ఉన్నప్పుడు వాటిని సరిచేయవచ్చు. దానికి బదులు కొందరు మరో కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటారు. తొలి కార్డును స్వాధీనం చేయకుండానే మరో దాన్ని పొందుతారు. వివిధ కారణాల వలన ఒకటి కంటే ఎక్కువ పాన్కార్డులు ఉన్న వ్యక్తులు ఆదాయపు పన్ను శాఖ జరిమానా, చర్యలకు లోనవ్వాల్సి ఉంటుంది. దీని నుంచి తప్పించుకోవాలంటే వారు ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు విధానాల ద్వారా కూడా తప్పనిసరిగా అదనపు పాన్ కార్డులను ఇచ్చేయాల్సి ఉంటుంది. చాలా సులువైన విధానం ద్వారా అదనపు పాన్ కార్డులను ప్రభుత్వానికి అప్పగించొచ్చు.
RS 10000 penalty for multiple PAN cards