Friday, April 19, 2024

మోత్కూరులోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

Rs 4 lakh burnt in fire accident

మోత్కూరు: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని ఓ ఇంట్లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, కష్టపడి కూడబెట్టుకున్న పైసలు బూడిదపాలయ్యాయి బాధితులు తెలిపారు. ఇంట్లో దాచిన రూ. 4లక్షలు కాలిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News