Saturday, April 20, 2024

వాహనాల తనిఖీల్లో రూ.60 లక్షలు పట్టివేత

- Advertisement -
- Advertisement -

Rs 60 lakh cash seized in vehicle inspection in chevella

రంగారెడ్డి : మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని షాబాద్ చౌరస్తాలో చేవెళ్ల తహశీల్దార్ కార్యాలయం, పోలీస్ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అక్రమంగా డబ్బును తరలించకుండా వాహనాలు తనిఖీ చేపట్టినట్లు తహశీల్దార్ షర్మిల తెలిపారు. తనిఖీలో భాగంగా మంగళవారం అక్రమంగా తరలిస్తున్న రూ.60లక్షలు రెవెన్యూ ఇన్స్‌స్పెక్టర్ షఫీ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. పట్టుబడ్డ డబ్బులకు సరైన ఆధారాలు లేనందున వాహనాన్ని, ఆరవై లక్షలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు ఆర్‌ఐ తెలిపారు.

Rs 60 lakh cash seized in vehicle inspection in chevella

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News