Wednesday, April 24, 2024

ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్

- Advertisement -
- Advertisement -

విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు జాతీయ రహదారిపై గరుడ ఆర్టీసీ బస్సు లారీని ఢీకొన్న ఘటనలో 15 మంది ప్రయాణికులు గాయపడగా, బస్సు డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా లారీని వెనుక నుంచి బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను రక్షించారు. గాయపడిన ప్రయాణికులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు, ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News