Wednesday, April 24, 2024

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసి బస్సు.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

RTC bus collides with two-wheeler: One killed

 

మన తెలంగాణ/ములుగు క్రైం : ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసి బస్సు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి కాలు విరిగిన సంఘటన ములుగు మండలంలోని కాసిందేవి పేట శివారులో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ 2 డిపోకు చెందిన అంకన్న గూడెం బస్సు ములుగు బస్టాండ్ నుండి బయలు దేరి కాసిందేవి పేట మీదుగా ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో కాసిందేవి పేట శివారు లో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనం పై వస్తున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన కూలీలు సుశాంత్ చౌదరి(24) మృతి చెందగా, రబీరావు కాలు విరిగి తీవ్రగాయాలు కాగా క్షతగాత్రులను ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇరువురు కూలీలు విద్యుత్ స్తంబాల పని నిమిత్తం మండలంలోని అంకన్న గూడెం గ్రామానికి గత నెలరోజుల క్రితం వచ్చినట్లు తోటి కూలీలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News