Friday, March 29, 2024

మంథనిలో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంథని సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. పరకాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బెల్లపల్లి నుంచి భూపాలపల్లి వైపు ప్రయాణికులతో వెళుతున్న సమయంలో మంథని దాటాక గాడిదుల గండి వద్ద ఓ కారును ఢీకొట్టింది. దీంతో కారు, ఆర్టీసి బస్సు రోడ్డు పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లి బోల్తాకొట్టాయి. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం కావడంతో అందులో ఉన్న వ్యక్తి మరణించాడు. బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

RTC Bus plunges into valley in Manthani

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News