Wednesday, April 24, 2024

తాండూరులో ఆర్‌టిసి బస్సు చోరీ

- Advertisement -
- Advertisement -
Bus-Stolen
పట్టణ శివారులో బస్సును వదిలి వెళ్లిన దుండగుడు

తాండూరు : తాండూరులో ఆర్‌టిసి బస్సు చోరీ జరిగింది. ఆదివారం రాత్రి ఓగిపూరు వెళ్లే బస్సును బస్టాండ్‌లో పాయింట్‌పై నిలిపారు. డ్రైవర్, కండక్టర్ బస్సు దిగి డిపోలోకి వెళ్లగానే ఓ దుండగుడు బస్సును తీసుకెళ్లిపోయాడు. బస్సులో ఉన్న ప్రయాణికులు ఆ వ్యక్తిని చూసి అనుమానించారు. కొద్ది దూరం పోయాక కండక్టరు లేకుండా బస్సు ఎలా తీసుకెళుతున్నారని ప్రయాణికులు ప్రశ్నించారు. డ్రైవర్, కండక్టర్ అన్ని నేనే అంటూ దుండగుడు బస్సును ముందుకు తీసుకెళ్లా డు. బస్టాండ్ నుంచి మల్లప్ప మడిగ వరకు వెళ్లగానే బస్సును ఆపి పారిపోయాడు.

ఈ విషయంపై ప్రయాణికులు తాండూరు డిపో మేనేజర్ రాజశేఖర్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన డిపో మేనేజర్, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి హానీ జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయమై డిపో మేనేజర్‌ను వివరణ కోరగా, రాత్రి నైట్ ఆల్ట్ బస్సు కరణ్‌కోట్‌కు వెళ్లేందుకు పాయింట్‌పై ఉండగా దుండగుడు తాగిన మైకంలో బస్సును తీసుకెళ్లినట్లు అనుమానాలు ఉన్నాయని చెప్పారు.

RTC Bus Stolen In Tandur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News