Thursday, April 25, 2024

గూడ్స్ వ్యాన్ ఢీకొని ఆర్టీసి డ్రైవర్ మృతి

- Advertisement -
- Advertisement -

RTC Driver died in Road accident

మన తెలంగాణ/రామడుగు: గూడ్స్ వ్యాన్ ఢీకొని ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని దేశరాజుపల్లి స్టేజీ వద్ద బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… కొత్తపల్లి మండలానికి చెందిన నాయిని అశోక్ కరీంనగర్ రెండవ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా మృతుడు తన స్వగ్రామమైన కొత్తపల్లి నుండి దేశరాజుపల్లి గ్రామానికి తన ద్విచక్రవాహనంపై వస్తుండగా కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారి దేశరాజుపల్లి స్టేజీ వద్ద బుధవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో గ్రామంలోకి వెళ్లే క్రమంలో కరీంనగర్ నుండి జగిత్యాల వైపు వెళ్తున్న అశోక్ లేలాండ్ గూడ్స్ వ్యాన్ డ్రైవర్ వెనుక నుంచి వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో అశోక్ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108లో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుని అన్న కొడుకు నాయిని ప్రణయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గొల్లపల్లి అనూష తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News