- Advertisement -
హైదరాబాద్: నల్లగొండ ఆర్టిసి బస్సు డిపో ప్రాంగణంలో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా టిఎస్ ఆర్ టిసి ఎండి సజ్జనార్ మొక్కలు నాటారు. శనివారం ఉదయం సజ్జనార్ హైదరాబాద్ నుంచి నల్లగొండకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా నల్లగొండ బస్టాండ్లో సజ్జనార్ తనిఖీలు నిర్వహించి ప్రయాణికులతో ముచ్చటించారు. అనంతరం బస్సు డిపోలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. ప్రాంగణంలో మొక్కలు నాటారు.
RTC MD Sajjanar sapling plant at Nalgonda Depot
- Advertisement -