మనతెలంగాణ/రుద్రూర్: టిఆర్ఎస్ ఎస్సి సేల్ నూతన కమిటీని మండలకేంద్రంలో ఆదివారం గ్రామ పార్టీ అధ్యక్షుడు శంకర్ కార్యదర్శి తోట్ల గంగారం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బుడ్డోళ్ళ సాయిలు ఉపాధ్యక్షుడిగా బోర్ల కిషోర్ కార్యదర్శిగా దాసరి శామ్ సంయుక్త కార్యదర్శిగా నరేష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని అధ్యక్షులు పేర్కొన్నారు. వీరిలోపాటు 15 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నట్లు నూతన అధ్యక్షుడు సాయిలు తెలిపారు.
మంత్రిని కలిసిన నూతన కమిటీ
రుద్రూర్ గ్రామ ఎసి సెల్ టిఆర్ఎస్ నూతన కమిటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచా రం శ్రీనివాస్ రెడ్డిని కలిశారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడా పట్టణంలోని ఆయన స్వ గృహంలో మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ పటిష్టత కోసం తాము కృషి చేస్తామని నూలన కమిటి సభ్యులు ప్రమాణం చేశారు.
మంత్రిని కలిసిన వారిలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరోజ్ గంగారం టిఆర్ఎస్ మండల అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, కోడె శంకర్, తోట్ల గంగారం ఉన్నారు.
రుద్రూర్ టిఆర్ఎస్ ఎస్సి సెల్ కమిటీ ఎన్నిక
- Advertisement -
- Advertisement -