Saturday, April 20, 2024

మొయినాబాద్ రోడ్డు ప్రమాదం… మృతులకు నివాళులర్పించిన సబిత

- Advertisement -
- Advertisement -

Sabitha condolence to dead in road accident

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చేవెళ్ల నియోజకవర్గము మొయినాబాద్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన మోర వెంకటేష్ కుటుంబ సభ్యులను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు.

మొయినాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సౌమ్య మృతదేహం వద్ద నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సబితా ప్రగాఢ సానుభూతి తెలిపారు. అక్కాచెళ్లలో ప్రేమిక ముందే మృతి చెందగా, సౌమ్య కూడా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందడపై మంత్రి సంతాపం ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడిన అక్షయ ఆరోగ్య పరిస్థితిపై కూడా మంత్రి కుటుంబీకులతో ఆరా తీశారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News