Thursday, April 25, 2024

మహేశ్వరం బాలికల పాఠశాలను సందర్శించనున్న సబితా ఇంద్రారెడ్డి

- Advertisement -
- Advertisement -

 

వికారాబాద్: పాఠశాలల ప్రారంభం కావడంతో మహేశ్వరం బాలికల పాఠశాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం మధ్యాహ్నం సందర్శించనున్నారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సవరణలు చేస్తూ బుధవారం నుంచే తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురుకులాలు మినహా మిగతా పాఠశాలలు, కళాశాలలు, వర్శిటీలు బుధవారం నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది. ప్రత్యక్ష తరగతులకు కచ్చితంగా హాజరు కావాలని విద్యార్థులను బలవంతపెట్టొద్దని ఆదేశిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News