Saturday, April 20, 2024

వరదలో కొట్టుకపోయిన కారు… నవ వధువు కుటుంబాన్ని పరామర్శించిన సబిత

- Advertisement -
- Advertisement -

Sabitha Indra reddy visit groom house

 

వికారాబాద్: మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగులో కారు గల్లంతైన ఘటనలో మృతి చెందిన నవ వధువు ప్రవళిక కుటుంబ సభ్యులను మోమిన్ పెట్ మండల కేంద్రంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  పరామర్శించారు. ప్రవళిక తల్లిదండ్రులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మర్పల్లి మండలం రావులపల్లి గ్రామంలో ప్రాణాలు కాపాడుకున్న నవాజ్ రెడ్డిని పరామర్శించి, కుటుంభ సభ్యులను ఓదార్చారు. నవాజ్ రెడ్డి సోదరి మృతి పట్ల సంతాపం తెలిపారు.

ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, జడ్పీ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్ కలిసి మోమిన్ పెట్, రావుల పల్లి గ్రామాలకు వెళ్లి బాధితుల వివరాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి అడిగి తెలుసుకున్నారు.  సంఘటనపై మంత్రి సబితా రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా, మరో బాలుని ఆచూకీ తెలియక పోవటంతో వాగు పరివాహక ప్రాంతాల్లో ముమ్మరంగా గాలించాలని వికారాబాద్ ఎస్పీ కి మంత్రి సబితా రెడ్డి ఆదేశించారు.

Car washed in river at Vikarabad district

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News