Friday, March 29, 2024

క్షతగాత్రులను పరామర్శించిన సబితా ఇంద్రారెడ్డి

- Advertisement -
- Advertisement -

Sabitha Indra reddy visit osmania hospital

కుల్కచర్ల: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. రంగారెడ్డి జిల్లాలోని కుల్కచర్ల మండలం ముజాహిద్ పూర్ గ్రామ పరిధిలో విద్యార్థులు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం ప్రమాదానికి గురికావడంతో వారు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనకు దారి తీసిన కారణాలను మంత్రి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన విద్యార్థులకు ఉత్తమ వైద్యసేవలను అందించాలని వైద్యాధికారులకు సబితా ఆదేశించారు. గాయపడిన విద్యార్థుల్లో ఐదుగురికి మాత్రం స్వల్పంగా గాయపడ్డారని, ఒకరు మాత్రం తీవ్రంగా గాయపడ్డారని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్బంగా అక్కడే ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులను మంత్రి పరామర్శించి వారికి దైర్యం చెప్పారు. గాయపడిన విద్యార్థులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వమే చికిత్స అందిస్తుందని, ఎవరు ఆందోళనపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. మంత్రి వెంట ఎంఎల్ సి జనార్దన్ రెడ్డి ఉన్నారు. గాయపడిన విద్యార్థులకు ఉత్తమ వైద్య సేవలు అందించే విధంగా పర్యవేక్షించాలని వికారాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిని మంత్రి ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News