Friday, April 19, 2024

వాగులో గల్లంతైన పాషా మృతి: కుటుంబాన్ని పరామర్శించిన సబితా

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: పులుసు మామిడి వాగులో గల్లంతై మృతి చెందిన ఇసాక్ పాషా కుటుంబ సభ్యులను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. బుధవారం ఉదయం వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, కలెక్టర్ నిఖిల, అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, తదితరులతో కలిసి మృతుని కుటుంబ సభ్యులను మంత్రి వర్యులు సబితా రెడ్డి పరామర్శించారు. భర్తను కోల్పోయి ఇద్దరు కవల పిల్లలతో రోధిస్తున్న భార్య సమినా బేగంను చూసి మంత్రి చలించిపోయారు. ఇసాక్ మృతి అత్యంత బాధాకరమని, మృతుని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సబితా అన్నారు. మృతుని భార్యకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగం కల్పించాలని మంత్రి కలెక్టర్ ను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యేతో కలిసి అండగా ఉంటామని మృతుని తండ్రి ఖాజా మియాకు అభయమిచ్చారు.

Sabitha visit Pasha family who Drowned in River

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News