Thursday, April 25, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశానికి ఆదర్శం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ పచ్చదనం పెంపు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశానికి ఆదర్శం
మిగతా రాష్ట్రాలు ఈ పోటీని స్వీకరించాలి
సేవ్ సాయిల్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లక్షం ఒక్కటే, పుడమిని కాపాడటం
ప్రకృతికి, మట్టికి ప్రత్యామ్నాయం లేదు, కాపాడాలి.. భవిష్యత్ తరాలకు అందించాలి
దేశం పచ్చబడాలనే యువ ఎంపి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చొరవ అభినందనీయం
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఐదవ విడతను హైదరాబాద్‌లో ప్రారంభించిన సద్గురు జగ్గీ వాసుదేవ్
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణకు హరితహారం ద్వారా పచ్చదనం పెంపు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాలు దేశానికే ఆదర్శమని, మిగతా రాష్ట్రాలు ఈ పోటీని స్వీకరించాలని సుద్గరు జగ్గీ వాసుదేవ్ చెప్పారు. తన ప్రపంచ పర్యటనలో భాగంగా తెలంగాణలోకి ప్రవేశించగానే భారీ పచ్చదనం ఆకర్షించిందని అన్నారు. వ్యవసాయంలో రసాయనాల వాడకంతో నేల తల్లి జీవం కోల్పోతోందని, రానున్న తరాలకు ఇది పెను ముప్పు కాబోతోందన్నారు. పుడమికి, మట్టికి ప్రత్యామ్నాయం లేదని, వీలైనంతగా కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందించాలని ఆయన ఆకాంక్షించారు. సేవ్ సాయిల్ (మట్టిని రక్షించు) ఉద్యమాన్ని చేపట్టి ప్రపంచ యాత్ర చేస్తున్న ఆయన హైదరాబాద్ మీదుగా బెంగళూరు పయనం అయ్యారు. మార్గమధ్యలో ఎంపి జోగనిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఐదవ విడతను శంషాబాద్ సమీపంలోని గొల్లూరు అటవీ ప్రాంతంలో సద్గురు స్వయంగా మొక్కలను నాటి లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్‌తో పాటు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపి రంజిత్‌రెడ్డి, ఎంఎల్‌ఎ ప్రకాష్‌గౌడ్, ఎంఎల్‌సిలు నవీన్‌కుమార్, శంభీపూర్ రాజు, దండే విఠల్ పాల్గొని మొక్కలు నాటారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలంగాణకు హరితహారం ప్రగతి నివేదికను సమావేశంలో వివరించారు. ప్రభుత్వం సాధించిన పచ్చదనం పెంపు విజయాలను సద్గురుకు వివరించారు.
యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఎంపి సంతోష్ : సద్గురు ప్రశంస
సద్గురు చిన్న వయసులో పెద్ద కార్యక్రమం చేపట్టిన సంతోష్ కుమార్ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని సద్గురు ప్రశంసించారు. సేవ్ సాయిల్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రెండు ఉద్యమాల లక్షం ఒక్కటేనని పుడమిని కాపాడుతూ, ప్రకృతి, పర్యావరణ ప్రాధాన్యతను ప్రతీ ఒక్కరికీ తెలియజెప్పటమే అన్నారు.
పూర్వ జన్మ సుకృతం
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతం: ఎంపి సంతోష్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మానస పుత్రిక తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో దేశమంతా హరిత భావజాలం వ్యాపింపజేయాలని నాలుగేళ్ల క్రితం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టామని ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. ఐదో యేట అడుగుపెట్టిన తమను వెన్నంటి ప్రొత్సహిస్తూ, గ్రీన్ ఇండియా తరపున చేపట్టిన ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతీ ఒక్కరికీ సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఇంతటి ఆదరాభిమానాలు సద్గురు ఆశీస్సులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందుకోవటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు. త్వరలోనే మరిన్ని వినూత్న కార్యక్రమాలు తీసుకుంటామని అన్నారు. గొల్లూరు ప్రాంతంలో క్షీణించిన అటవీ ప్రాంతంలో భారీగా చెట్లను పెంచి, చిక్కని పచ్చదనం పెంచాలనే లక్షంతో యాదాద్రి మోడల్ ప్లాంటేషన్‌ను అటవీ శాఖ సహకారంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టింది. మొదటి దశలో ఇప్పటికే సుమారు తొమ్మిది వందల ఎకరాల అటవీ ప్రాంతం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. అటవీ పునరుద్ధరణ పనుల్లో భాగంగా, ఐదవ విడత గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఒకేసారి పది వేల మొక్కలను నాటారు. సద్గురుతో పాట, ఆయన అభిమానులు, ఈషా ఫౌండేషన్ సభ్యులు, పాఠశాల విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సిఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఓఎస్డీ ప్రియాంక వర్ఘీస్, ప్రభుత్వ సలహాదారు ఆర్.శోభ, పిసిసిఎఫ్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఆర్.ఎం.డోబ్రియల్, అదనపు పిసిసిఎఫ్ సునీతా భగవత్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రంగారెడ్డి డిఎఫ్‌ఒ జానకిరామ్, ఎఫ్‌ఆర్వో విష్ణు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కరుణాకర్ రెడ్డి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Sadhguru Praises on Green India Challenge

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News