Thursday, April 25, 2024

ఎంపి సంతోష్ కుమార్‌కు లేఖ రాసిన సద్గురు

- Advertisement -
- Advertisement -

Sadhguru wrote letter to MP Santhosh Kumar

హైదరాబాద్ : దేశంలో 52% వ్యవసాయ భూములు నిస్సారమైనట్లు సద్గురు జగ్జీవాసుదేవ్ తెలిపారు. దేశంలో మట్టి క్షీణత తీవ్రమైన సమస్యగా మారిందని, ఈ విపత్కర పరిస్థితుల్లో మనం మన నేలను కాపాడుకోకపోతే దేశంలో వ్యవసాయ సంక్షోభం సంభవించే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయమై ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌కి రాసిన లేఖలో ‘సేవ్ సాయిల్ మూమెంట్’ సాధించిన ప్రగతిని సద్గురు వివరించారు. ఈ జఠిలమైన నేలనిస్సార సంక్షోభ సమస్యకు పరిష్కారం చూపించేందుకు తీను యూరప్‌లో మొదలుపెట్టి సెంట్రల్ ఆసియా, మిడిల్ ఈస్ట్, ఇండియాలలో 100 రోజుల్లో 30 వేల కిలోమీటర్లు బైక్ ర్యాలీ చేసి 3.9 బిలియన్ల ప్రజలకు ‘సేవ్ సాయిల్’ సందేశం చేరవేసినట్టు లేఖలో ఆయన తెలిపారు.

నేలను కాపాడేందుకు “దేశంలో రైతులు వ్యవసాయంలో 3–6% సేంద్రీయ పద్ధతులను అనుసరించేలా చేయడం”.. రైతులకు “కార్బన్ క్రెడిట్ ఇన్సెంటివ్స్‌” అందించేందుకు కృషి చేయడం, “పండిన పంట పోషకాల ఆధారంగా కాకుండా, అవి పండించిన నేలలోని సేంద్రీయ లెక్కల ఆధారంగా లేబుల్ చేయడం” అనే మూడు ఆశయాలతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. అందుకోసం దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్లు సద్గురు తెలిపారు. అంతేకాదు, “సేవ్ సాయిల్‌” మూవ్‌మెంట్‌ను మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఎంపి సంతోష్ కుమార్ నుంచి మరింత సహకారం ఆశిస్తున్నట్లు లేఖలో తెలిపారు. సద్గురు లేఖపై స్పందించిన సంతోష్ కుమార్ “సేవ్ సాయిల్‌” మూమెంట్ అద్భుతమైన కార్యక్రమమని, అందుకే హైదరాబాద్‌లో సద్గురు నిర్వహించిన “సేవ్ సాయిల్‌” కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌”ను భాగం చేసినట్లు తెలిపారు. మట్టిని కాపాడాలంటే మొక్కలు నాటడం ఒక్కటే పరిష్కారమని ఈ సందర్భంగా సంతోష్ కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News