- Advertisement -
పవన్కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమాను చేస్తున్నాడు. వచ్చే నెలలో పవన్ 27వ సినిమా క్రిష్ దర్శకత్వంలో ప్రారంభం కాబోతోంది. ‘వకీల్ సాబ్’ విడుదలకు ముందే క్రిష్ మూవీ చిత్రీకరణను ప్రారంభించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు జరిగాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి కనిపించబోతుంది అంటూ గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఆమె ఇంతకు ముందు క్రిష్ ఆఫర్ను తిరస్కరించింది. పాత్ర నచ్చక పోవడంతో ఆమె నో చెప్పిందనే వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి కథ, పాత్రలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి ఆమెకు వినిపించడంతో ఈసారి ఓకే చెప్పిందట. జమీందార్ కూతురి పాత్రలో సాయిపల్లవి కనిపించబోతున్నట్లుగా తెలిసింది.
- Advertisement -