- Advertisement -
కొత్తగూడ: నీళ్లు తాగడానికి వచ్చిన అటవీ జంతువు సాంబర్ డీర్ కాళ్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం రేణ్యాతండా సమీపంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… రేణ్యాతండా, చిన్నతండా మధ్య చెరువులో సాంబర్ డీర్ నీళ్లు తాగడానికి వచ్చింది. కొందరు యువకులు డీర్ ను గుర్తించి వెంబడించారు. జింక బురదలో ఇరుక్కోవడంతో సదరు యువకులు గొడ్డలితో వెనక కాళ్లు నరికారు. రెండు కాళ్లు విరిగిన జింక గట్టిగా మూలగడంతో గ్రామస్థులు అక్కడికి చేరుకొని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని చికిత్స నిమిత్తం జింకను ట్రాక్టర్లో హన్మకొండలోని వనవిజ్ఞాన కేంద్రానికి తరలించారు.
- Advertisement -