Friday, March 29, 2024

పోలీసులపై ఇసుక మాఫియా దాడి…

- Advertisement -
- Advertisement -

Sand mafia attack on police in Jagtial

 

జగిత్యాల: పోలీసులపై ఇసుక మాఫియా కర్రలు, రాళ్లతో దాడి చేసిన సంఘటన జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వేంపల్లి శివారులోని వాగు వద్ద పెద్ద ఎత్తున ట్రాక్టర్లను, ఎక్స్‌కవేటర్లను తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం రావడంతో కానిస్టేబుళ్లు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు ఇసుక ట్రాక్టర్ల వద్దకు చేరుకోగానే వారిపై ఇసుక మాఫియా కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇసుక ట్రాక్టర్లను వాగులో వదిలి వాహన డ్రైవర్లు పారిపోయారు. కేసు నమోదు చేసి ఐదు ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నామని స్థానిక ఎస్ఐ తెలిపాడు. దాడికి పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News