- Advertisement -
మనతెలంగాణ/రాయికల్: మహామ్మారి కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పల్లెల్లో పారిశుద్ద కార్మికులు ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందజేస్తున్నారు. వీధుల్లో పేరుకుపోయిన చెత్త, మురికికాల్వలను శుభ్రం చేయడంతో రోజంతా పనిలో తలమునకలౌతున్నారు. రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన పుట్ట భూమరాజం ఆదివారం యధావిధిగా పారిశుద్ద విధులకు హజరై ప్రజల అభిమానాన్ని మరింత సంపాదించుకున్నాడు. ఆదివారం తన కుమారుడైన పుట్ట శ్రీనివాస్ పెళ్లి జరుగుతుండగా బంధువులు, కుటుంబసభ్యులంతా పెళ్లి పనుల్లో మునిగి తేలుతుండగా భూమరాజం గ్రామంలో వీధులను ఊడ్చి, మురికికాల్వల్లో చెత్తను తొలగించి యదావిధిగా విధులు నిర్వర్తించడం పట్ల గ్రామసర్పంచ్ అజారోద్దీన్, ఎంపిటిసి రాజనాల మధులు అభినందించారు.
sanitation worker attends duties at Son wedding day
- Advertisement -