లండన్: సనోఫీ, గ్లాక్సోస్మిత్క్లిన్ సంస్థలు తాము తయారు చేస్తున్న వ్యాక్సిన్కు సంబంధించి మనుషులపై ట్రయల్స్ ప్రారంభించాయి. అంతకు ముందు ట్రయల్స్లో సత్ఫలితాలు రావడంతో ఇప్పుడు మనుషులపై ప్రయోగాలు ప్రారంభించారు. అమెరికా లోని 11 ప్రాంతాల్లో 440 మంది వయోజనులపై వ్యాక్సిన్ను పరీక్షిస్తామని ఆ సంస్థలు వెల్లడించాయి. డిసెంబర్ నెల మొదట్లో ఈ తొలివిడత ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ట్రయల్స్ సత్ఫలితాలు అందిస్తే తరువాత భారీ స్థాయిలో ట్రయల్స్ చేపడతారు.
ట్రయల్స్ నుంచి వెలువడే డేటా తమకు ప్రోత్సాహకరంగా ఉంటే 2021 ప్రారంభంలో రెగ్యులేటరీ అప్రూవల్ కోరతామని సంస్థలు చెప్పాయి. గత జులైలో ఈ సంస్థలు అమెరికా ప్రభుత్వ సహాయంతో 100 మిలియన్ డోసుల వ్యాక్సిన్ను ఉత్పత్తి చేస్తామని ప్రకటించాయి. ప్రభుత్వం కొనుగోలు చేస్తే భవిష్యత్తులో 500 మిలియన్ డోసుల వరకు తయారు చేయగలమని వివరించాయి. ఈ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం 60 మిలియన్ డోసుల వరకు కొనుగోలు చేయడానికి అంగీకరించింది.
Sanofi and GSK move Covid vaccine into human trials