Tuesday, April 23, 2024

అనాథ శవానికి అంత్యక్రియలు జరిపించిన సర్పంచ్

- Advertisement -
- Advertisement -

పిట్లం: కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో నివాసముంటున్న కిష్టాపూర్ గ్రామానికి చెందిన మహిళ అనారోగ్యంతో మృతిచెందింది. మృతురాలికి బంధువు లెవ్వరు లేకపోవడంతో విషయం తెలుసుకున్న పిట్లం సర్పంచ్ విజయ శ్రీనివాస్ రెడ్డి అనాథ శవానికి అంత్యక్రియలు జరిపించారు. ఈ సందర్బంగా సర్పంచ్‌ను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు సాయిలు, శోభ పోచయ్య, జీపీ సిబ్బంది తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News