- Advertisement -
నాగర్ కర్నూల్: తొలి విడత పల్లె ప్రగతిలో సర్పంచ్, కార్యదర్శులు అద్భుతంగా పని చేశారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. పాలెంలో పల్లెప్రగతి, పట్టణ ప్రగతిపై ప్రజాప్రతినిధుల సమ్మేళనంలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. ఉద్యోగుల కృషితోనే ప్రభుత్వ పథకాలు విజయవంతమయ్యాయన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రజాప్రతినిధులు పని చేయాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇంకుడు గుంతలను యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపి రాములు, ఎంఎల్ఎ మర్రి జానార్ధన్ రెడ్డి, జడ్పి చైర్పర్సన్ పద్మావతి, కలెక్టర్ శ్రీధర్ తదితరలు పాల్గొన్నారు.
Sarpanch, Secretary Good work in Palle Pragathi
- Advertisement -