Friday, April 19, 2024

కాంగ్రెస్, బిజెపోళ్లు గంగిరెద్దోళ్లలా వచ్చి వెళ్లిపోతారు: సత్యవతి

- Advertisement -
- Advertisement -

Seven New Eklavya Schools in Telangana

 

మహబూబాబాద్: పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు అనగానే కాంగ్రెస్, బిజెపి వాళ్లు గంగిరెద్దోళ్లలా వచ్చి వెళ్లిపోతారని చురకలంటించారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణకు బిజెపి ప్రభుత్వం చేసిందేమీ లేదని, పునర్విభజన చట్టంలో ఉన్న అంశాలను కేంద్రం ఒక్కటి కూడా అమలు చేయడంలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి పూర్తికాని పోలవరం కనపడుతోంది గానీ, బీడు బారి నెర్రెలు చాచినా నేలను  కాళేశ్వరం నీళ్లతో తడిపిన కూడా కనిపించడం లేదని మండిపడ్డారు. దేశ రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలను పక్కనబెట్టి.. బిజెపి ప్రభుత్వం ఆదానీ, అంబానీ లాంటి సంపన్నుల కోసం దేశ ఆస్తులను దోచిపెడుతోందని సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కేంద్ర మంత్రులు ప్రశంసిస్తుంటే… ఇక్కడి బిజెపి నేతలు మాత్రం విమర్శించడం సిగ్గుచేటన్నారు. మానుకోట రాళ్ల చరిత్ర మీకు తెలుసా? అని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కి గుర్తు చేశారు. ప్రజా ఆగ్రహానికి గురై మరోసారి మానుకోట రాళ్లకు పని కల్పించొద్దని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News