Thursday, March 28, 2024

కెసిఆర్, కెటిఆర్లు కోలుకోవాలని యాదాద్రిలో సత్యవతి రాథోడ్‌ ప్రత్యేక పూజలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్, పార్టీ కార్యనిర్వా హక అధ్యక్షులు మంత్రి కెటిఆర్, రాజ్యసభ సభ్యులు సంతోష్‌లు ఆరోగ్యం క్షేమంగా ఉండాలని, త్వరగా కోవిడ్ బారి నుంచి కోలుకోవాలని, ఈ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, ఈ కరోనా పీడ వదలాలని ప్రార్థిస్తూ సోమవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రాష్ట్ర గిరిజన స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేక పూజలు చేశారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో ప్రజలు ముఖ్యమంత్రి కెసిఆర్ వెంట ఉన్నారని తమ ఓటు ద్వారా చెప్పారని, మున్సిపల్, కార్పొరోషన్ల ఎన్నికల్లో కూడా ప్రజలు కెసిఆర్ వెంటే ఉన్నారని, ఈ ప్రజలకు మరింత సేవ చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కి మరింత శక్తినివ్వాలని ఆ స్వామివారిని కోరుకున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.

Satyavati Rathod special puja in Yadadri for KCR to recover

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News