- Advertisement -
న్యూఢిల్లీ: రాష్ట్ర డిజిపి నియామకంపై బెంగాల్లోని మమతాబెనర్జీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. డిజిపి నియామకం విషయంలో యుపిఎస్సిని సంప్రదించాలన్న నిబంధన సమాఖ్య విధానానికి విరుద్ధమంటూ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఎల్. నాగేశ్వర్రావు, జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం తిరస్కరించింది. ఈ పిటిషన్లో కోరిన అంశం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఇటువంటి పిటిషనే గతంలోనూ వేశారని, కోర్టు సమయాన్ని వృథా చేసే ఇలాంటి పిటిషన్లు వేయకుండా స్వీయ నియంత్రణ పాటించాలని ధర్మాసనం హితవు పలికింది.
- Advertisement -