Wednesday, April 24, 2024

పెద్దలు ఇంటి నుంచి పనిచేస్తుంటే… పిల్లలు పాఠశాలకా ?

- Advertisement -
- Advertisement -
SC slams Delhi government for opening the schools
24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను ఆదేశించిన సుప్రీం

న్యూఢిల్లీ : ఢిల్లీలో వాయు కాలుష్యంపై గత నాలుగు రోజులుగా విచారణ సాగిస్తున్న అత్యున్నత న్యాయస్థానం గురువారం మళ్లీ కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలపై అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించినప్పటికీ పెద్దగా ఫలితం కనిపించడం లేదని, కాలుష్యం పెరుగుతూనే ఉందని తాము భావిస్తున్నామని, సమయం మాత్రం వృధా అవుతోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్య నివారణకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ ప్రభుత్వాన్ని న్యాయస్థానం హెచ్చరించింది. అలాగే పాఠశాలలు ప్రారంభించడంపై ఢిల్లీ ప్రభుత్వాన్ని మందలించింది. మూడు, నాలుగేళ్ల పిల్లలు పాఠశాలలకు వెళ్తుంటే , పెద్దలు ఇంటి నుంచి పనిచేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది.

పిల్లలు నేర్చుకునే ప్రక్రియలో వెనుకబడిపోతున్నారని, అనేక చర్చల అనంతరం , ఆన్‌లైన్ బోధన ఆప్షన్ తోనే పాఠశాలల ప్రారంభానికి అనుమతి ఇచ్చినట్టు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ‘ఆన్‌లైన్ బోధనను మీరు ఆప్షన్‌కు వదిలేశారు. కానీ ఇంట్లో ఎవరు కూర్చోవాలనుకుంటున్నారు. మ ఇంట్లో కూడా పిల్లలున్నారు. కరోనా మహమ్మారి వచ్చిన దగ్గరినుంచి వాళ్లకు ఎదురవుతున్న సమస్యలను మనం చూస్తూనే ఉన్నాం. మీరు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే … మేం కఠిన చర్యలు తీసుకుంటాం. మీకు 24 గంటల సమయం ఇస్తున్నాం.’ అంటూ ప్రధాన న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. మీరు ఇప్పుడు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కాలుష్యం ఎందుకు పెరుగుతోంది? ఎవరూ ఆ నిబంధనలను పాటించడం లేదు. ప్రచారం కోసం మాత్రం పర్యావరణాన్ని కాపాడాలంటూ బ్యానర్లు పట్టుకొని ధర్నాలు చేస్తారని కోర్టు వ్యాఖ్యానించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News