Saturday, April 20, 2024

రోడ్డు ప్రమాదంలో విద్యార్థులకు గాయాలు…

- Advertisement -
- Advertisement -

Accident

ఇందల్వాయి: నిజామాబాద్‌ జిల్లాలోని ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వేగంగా వెళ్తున్న స్కూల్‌ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాద సంఘటనలో 4వ తరగతి  విద్యార్థులు ప్రణవ్‌, మున్నాలకు తీవ్ర గాయలవ్వగా… డ్రైవర్‌ శ్రీనివాస్‌ స్వల్పంగా గాయపడ్డాడు. బస్సు అదుపుతప్పడాన్ని గమనించి అప్రమత్తమైన స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొని పలువురు విద్యార్థులను కాపాడారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప సర్కార్ దవాఖానకుకు తరలించారు.

School Bus Hits Tree At Nizamabad District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News