Thursday, April 25, 2024

నడిరోడ్డుపై కాల్పులు…. ప్రిన్సిపాల్ మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: బైక్‌పై వచ్చి దుండగులు జరిపిన కాల్పుల్లో ప్రిన్సిపాల్ మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగింది. ఈ ఘటనలో ప్రిన్సిపాల్ కూతురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కుషినగర్ జిల్లాలోని అహిరౌలి ప్రైమరీ స్కూల్‌లో నివేదిత (43) ప్రిన్సిపాల్‌గా పని చేస్తోంది. బసరత్‌పూర్‌లోని సెయింట్ జాన్ చర్చ్ సమీపంలో నివేదిత కుటుంబం నివస్తోంది. తన కూతురు డెలిషియాతో కలిసి తన బంధువుల ఇంటి నుంచి ఆమె ఇంటికి బైక్‌పై వస్తుండగా రాజీవ్‌నగర్‌లోని అషియాన్ సెంటర్ వద్ద ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి వారిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పులో నివేదిత శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లగా డెలిషియాకు ఒక బుల్లెట్ తగిలింది. వెంటనే స్థానికులు స్పందించి వారిని బిఆర్‌డి మెడికల్ కాలేజీకి తరలించారు. అప్పటికే ప్రిన్సిపాల్ చనిపోయిందని వైద్యులు తెలిపారు. డెలిషియా చాతీలో బుల్లెట్ దూసుకెళ్లడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. స్థానిక ఎస్‌పి జోగిందర్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నానని తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News