- Advertisement -
నారాయణపేట : నారాయణపేట జిల్లా నర్వ మండల పరిధిలోని కుమార్లింగంపల్లి గ్రామానికి చెందిన కొంత మంది విద్యార్థులు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. తమ గ్రామం నుంచి ఆత్మకూర్కు బయల్దేరిన వ్యాన్లో ఏడుగురు విద్యార్థులు , మరో ముగ్గురు ప్రయాణికులు ఎక్కారు. వ్యాన్ బయల్దేరిన కాసేపటికే ఇంజిన్లో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్, వ్యాన్ను ఆపి విద్యార్థులను, ముగ్గురు ప్రయాణికులను కాపాడాడు. ఈ ఘటనలో వ్యాన్ పూర్తిగా దగ్ధమైంది. పెను ప్రమాదం నుంచి బయటపడటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపరిపీల్చుకున్నారు.
school van burst into flames at narayanpet
- Advertisement -