కర్నాటక: బెంగళూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఓ ఫేస్ బుక్ పోస్టుపై జరిగిన గొడవ తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు మృతి చెందగా.. నలుగురు గాయపడ్డారు. 110 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళనకారుల రాళ్లదాడిలో 60మంది పోలీసులకు గాయాలయ్యాయి. 15 పోలీస్ వాహనాలు మంటల్లో తగలబడ్డాయి. ముందు జాగ్రత్తగా బెంగళూరులో 144 సెక్షన్ విధించారు. కాంగ్రెస్ ఎంఎల్ఎ శ్రీనివాసమూర్తి మేనల్లుడు ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టు ఈ వివాదానికి కారణమైంది. ఓ వర్గాన్ని కించపరిచేలా ఆయన పోస్ట్ పెట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ పోస్టును చూసిన వెంటనే ఆగ్రహించిన వందల మంది ఆందోళనకారులు ఎంఎల్ఎ ఇంటిని చుట్టూముట్టి, నిప్పుపెట్టారు. దీంతో ఘటనాస్థలంలో పోలీసులు భారీగా మోహరించారు.
Those who incited and perpetrated the #bangaloreriots must be found, arrested & given exemplary punishment. But they are not to be equated with an entire community any more than thugs & vigilantes represent all Hindus. This also happened in Bangalore: https://t.co/TCrfo6kU7k
— Shashi Tharoor (@ShashiTharoor) August 12, 2020