- Advertisement -
హైదరాబాద్: సికింద్రాబాద్ బిజెపిలో కార్యకర్తల మధ్య ఆదివారం ఘర్షణ జరిగింది. అంతర్గత విభేదాలు కారణాలతో కార్యకర్తలు రోడ్డుపైనే కొట్లాటకు దిగారు. పరస్పరం దాడులు చేసుకుని ఒకరినొకరు దూషించుకున్నారు. తార్నాక డివిజన్ అధ్యక్షుడు రాముపై శారదా మల్లేష్ దాడిచేశారు. దీంతో పంచాయతీ ఎమ్మెల్సీ రామచంద్రరావు దగ్గరకు చేరింది. రామచంద్రరావు ఇంటి దగ్గరకు భారీగా పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. ఈ ఘటనతో బిజెపి రాజకీయాలు రోడ్డెక్కాయని విమర్శలు వెల్లువెత్తున్నాయి.
Secunderabad BJP leaders fight on road
- Advertisement -