Friday, March 29, 2024

విధి నిర్వహణలో ఉన్న సెక్యురిటీ గార్డు ప్రమాదవశాత్తు మృతి

- Advertisement -
- Advertisement -

రు.17 లక్షలు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకారం

Security guard dead felt on gate

మన తెలంగాణ / పటాన్ చెరు: విధి నిర్వహణలో ఉన్న సెక్యురిటీ గార్డు ప్రమాదవశాత్తు మృతిచెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల పరిధిలోని రుద్రారం తోషిబా పరిశ్రమలో చోటుచేసుకుంది.  కార్మికులు ,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… మంగళవారం రాత్రి షిప్టు చేస్తున్నక్రమంలో మహమ్మద్ అలీ(40) అనే సెక్యురిటీ గార్డు విధి నిర్వహణలో భాగంగా మేన్ గేటు వద్ద డ్యూటి చేసే క్రమంలో గేటు జరుపగా ఒక్కసారిగి అతనిపై పడింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా సంగారెడ్డి చౌర్తలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అటునుంచి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టుగా డాక్టర్లు చెప్పారు. సెక్యురిటీ గార్డు కుటుంబాన్ని ఆదుకోవాలంటూ సిఐటియు నాయకులు యాజమాన్యాన్ని డిమాండ్ చేయడంతో యాజమాన్యం రు. 17 లక్షల పరిహారం తోపాటు దాహన సంస్కారాల కోసం రు. 10 వేలు ఇచ్చేందుకు అంగీకరించింది. యాజమాన్యంతో చర్చించిన వారిలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజయ్య, జిల్లా నాయకులు నాగేశ్వర్ రావు, యూనియన్ ప్రధాన కార్యదర్శి అనంతరావు తో పాటు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News