Friday, April 19, 2024

రాష్ట్ర సరిహద్దులో 7కిలోల బంగారం స్వాధీనం

- Advertisement -
- Advertisement -

Seized 7 kg of gold at the state border

హైదరాబాద్: రాష్ట్ర సరిహద్దులోని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఆదివారం నాడు పోలీసులు జరిపిన తనిఖీలలో 7 కిలోల బంగారం పట్టుబడింది. వీటిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళుతున్న కారును తనిఖీ చేసి సరైన పత్రాలు లేని బంగారం, నగదును గుర్తించి సీజ్ చేశారు. ఈక్రమంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న రూ.3 కోట్ల విలువైన బంగారంతో పాటు రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఇంత పెద్దమొత్తంలో బంగారం ఎలాంటి అనుమతులు లేకుండా ఎక్కడికి తీసుకెళ్తున్నారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Seized 7 kg of gold at the state border

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News