Wednesday, April 24, 2024

‘శంషాబాద్’లో విదేశీ కరెన్సీ పట్టివేత

- Advertisement -
- Advertisement -

seized of foreign currency in Shamshabad Airport

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం నాడు భారీగా విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.17.75 లక్షలు విలువచేసే విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. ఈక్రమంలో దుబాయ్ వెళ్లేందుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల లగేజీని తనిఖీ చేయగా సౌదీ, యూఎఇకు చెందిన కరెన్సీ దొరికింది. వాటి విలువ రూ.17.75 లక్షలు ఉంటుందని విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.వారి వద్ద నుంచి 89,500 సౌదీ అరేబియన్ రియాల్స్, 2,900 యుఏఈ దిర్హమ్లు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్ చేసేందుకు విదేశీ కరెన్సీ తెచ్చినట్లుగా గుర్తించారు. ఇద్దరు ప్రయాణీకులను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News