Friday, March 29, 2024

పోక్సో కేసులో నిందితుడికి జీవితఖైదు

- Advertisement -
- Advertisement -

తీర్పు చెప్పిన నాంపల్లి కోర్టు

మనతెలంగాణ, సిటిబ్యూరో: బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి జీవితఖైదు శిక్ష, రూ.20,000 జరిమానా విధిస్తూ సిటీ సివిల్ కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం….నగరంలోని ఆదర్శనగర్‌కు చెందిన బాలికను అదే కాలనీలో ఉంటున్న ఏడ్ల రమేష్ ఉంటున్నాడు. బాలికను 2018, జూన్, 25న కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. సైఫాబాద్ ఎసిపి వేణుగోపాల్ రెడ్డి దర్యాప్తు చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. సాక్షాలు పరిశీలించిన కోర్టు నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News