Friday, April 26, 2024

తల చెరువులో… మొండెం చెట్ల పొదల్లో

- Advertisement -
- Advertisement -

Served head in Lake in Vikarabad

 

వికారాబాద్: ఓ వ్యక్తిని హత్య చేసి తలను చెరువులో, మొండాన్ని చెట్ల పొదల్లో వేసిన సంఘటన వికారాబాద్ జిల్లా బోమ్స్ పేట మండలం మెట్లకుంట గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. మెట్లకుంట గ్రామంలో కుర్వ నర్సయ్య అనే వ్యక్తి ని నివసిస్తున్నాడు. అతడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి తల ఎల్లమ్మ చెరువు దగ్గర పడేయగా మొండాన్ని చెట్ల పొదల్లో పడేశారు. ఆదివారం బావి దగ్గరకు వెళ్లిన చంద్రయ్య ఇంటికి రాలేదు. వెతికినా అతడి ఆచూకీ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గ్రామానికి చేరుకొని వెతకగా అతడి తల లేని మొండెం చెట్ల పొదల్లో, తల చెరువులో కనిపించడంతో విడి భాగాలుగా ఉన్న మృతదేహం స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News