- Advertisement -
భువనేశ్వర్: బస్సులో ఏడుగురు మృతి చెందిన సంఘటన ఒడిశాలోని గంజాం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బెర్హమ్పూర్ నుంచి టికిరికి వెళ్తుండగా మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందగా 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Seven Members Dead in Bus Accident in Ganjam Dist
- Advertisement -