- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తంటి కొండ వెంకటేశ్వర ఆలయంలో వివాహం చేసుకొని పెళ్లి బృందం తిరిగి వస్తుండగా వ్యాన్ బోల్తా పడడంతో ఏడుగురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. పది మంది తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. క్షతగాత్రులను స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పార్కింగ్ స్థలం నుంచి రోడ్డు మీదకు రావాల్సిన వ్యాన్ అదుపు తప్పి మెట్లపై నుంచి బోల్తాపడినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతులు శ్రీదేవి, దొర, ప్రసాద్, బాను, శ్రీలక్ష్మిగా గుర్తించారు.
- Advertisement -