Friday, March 29, 2024

లద్దాఖ్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. ఏడుగురు సైనికులు మృతి

- Advertisement -
- Advertisement -

Seven soldiers killed in road mishap in Ladakh

శ్రీనగర్: లద్దాఖ్ లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు సైనికులు మృతిచెందారు. ఈ ప్రమాదంలో పలువురు సైనికులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  మెరుగైన వైద్యం కోసం తీవ్రంగా గాయపడిన సైనికుల ఎయిర్ అంబులెన్సులో తరలింపునకు చర్యలు చేపట్టారు. లద్దాఖ్ లోని టుర్టుక్ సెక్టార్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. 26 మంది ఆర్మీ సిబ్బందితో వెళ్తున్న బస్సు ష్యోక్ నదిలో పడిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News