Friday, March 29, 2024

రద్దైన పలు రైలు సర్వీసులు తిరిగి పునః ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Several canceled train services will be resumed

ఇరు రాష్ట్రాల ప్రజలకు దక్షిణమధ్య రైల్వే శుభవార్త

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. గతంలో పలు కారణాల వల్ల రద్దైన పలు రైలు సర్వీసులను తిరిగి ప్రారంభించింది. ఎపితో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని పలు రూట్ల మధ్య నడిచే డైలీ ఎక్స్‌ప్రెస్/ప్యాసింజర్/డెమూ రైళ్ల సేవలను పునరుద్ధరించారు. ఈ సేవలను ఏప్రిల్ 27వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి.

అధికారులు పునరుద్ధరించిన రైళ్ల వివరాలు ఇవే..

17646 (57650 పాత నెంబర్) రేపల్లే నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలు 07.50కి బయలు దేరి సాయంత్రం 04.55 గంటలకు గమ్యాన్ని చేరుకుంటుంది. ఈనెల 27వ తేదీన- సర్వీసు పునఃప్రారంభం కానుంది.

07594 (57688 పాత నెంబర్) కాచిగూడ నుంచి నిజమాబాద్ వెళ్లే రైలు 18.50కి బయలు దేరి రాత్రి 11.50 గంటలకు గమ్యాన్ని చేరుకుంటుంది. ఈ రైలు ఈనెల 29వ తేదీ- నుంచి అందుబాటులోకి రానుంది.

07595 (57689 పాత నెంబర్) నిజమాబాద్ నుంచి కాచిగూడ వెళ్లే రైలు 05.05కి బయలు దేరి రాత్రి 09.40కి గమ్యాన్ని చేరుకుంటుంది. ఈ రైలు సేవలు ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

ట్రెయిన్ నెంబర్ 17645 (57651 పాత నెంబర్) సికింద్రాబాద్ నుంచి రేపల్లే వెళ్లే రైలు 11.10 గంటలకు బయలుదేరి రాత్రి 07.45కి గమ్యాన్ని చేరుకుంటుంది. ఈ సర్వీసు ఈనెల 27వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.

07496 (77690 పాత నెంబర్) రాయచూర్ నుంచి గద్వాల్ వెళ్లే రైలు 13.10కి బయలుదేరి, 2.30 గంటలకు గమ్యాన్ని చేరుకుంటుంది. ఈనెల 27వ తేదీ నుంచి- ఈ రైలు పునఃప్రారంభం కానుంది.

07495 (77689 పాత నెంబర్) గద్వాల్ నుంచి రాయచ్చూర్ వెళ్లే రైలు 14.50కి బయలుదేరి సాయంత్రం 04.20 గంటలకు గమ్యాన్ని చేరుకుంటుంది. ఈ రైలు సర్వీసు ఈనెల 27వ తేదీ నుంచి పునఃప్రారంభం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News