- Advertisement -
రాజన్న సిరిసిల్ల : ఇద్దరు దుండగులు మూగ జీవాలపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దురదృష్టకరమైన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. బోయినిపల్లి ఎస్ఐ జి.శ్రీనివాస్ కథనం ప్రకారం నర్సింగాపూర్ గ్రామంలో ఓ రైతుకు చెందిన గేదేలపై శుక్రవారం రోజున అదే గ్రామంలో గ్రానైట్ క్వారీలో కూలీలుగా పనిచేస్తున్న నలిత్ కుమార్, హరీష్ అనే ఇద్దరు వ్యక్తులు రాత్రి మూగజీవాల( గేదేలు)పై అత్యాచారం చేస్తుండగా ఓ వ్యక్తి వారిని చూసి ఎస్ఐ శ్రీనివాస్కు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న ఎస్ఐ వారిని పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితులు రాజస్థాన్ రాష్ట్రంలోని డైలాంట్కు చెందిన వారిగా ఎస్ఐ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
Sexual assault on Animals
- Advertisement -