Friday, March 29, 2024

న్యూస్ యాంకర్‌ను కారులో వెంబడిస్తూ… వేధింపులు

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఓ న్యూస్ యాంకర్‌ను లైంగిక వేధింపులకు గురి చేసిన సంఘటన గుజరాత్‌లోని వస్త్రాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. భవానీ పటేల్ (33) అనే వ్యక్తి ఓ ఫార్మాసూటికల్ కంపెనీ యజమాని. 28 ఏళ్ల న్యూస్ యాంకర్ గాంధీనగర్‌లో ఉంటూ అహ్మదాబాద్ లోని ఓ న్యూస్ ఛానల్‌లో పని చేస్తోంది. అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా భవానీ కారులో ఆమెను వెంబడించాడు. పలుమార్లు రూట్లు మార్చిన కూడా ఆమెను వెంబడిస్తూనే ఉండడంతో మన్సీ సర్కిల్‌కు రాగానే ఆమె ద్విచక్రవాహనాన్ని ఆపింది. ఆమెతో అతడు అసభ్యంగా ప్రవర్తించడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశామని పోలీస్ అధికారి వైబి జడేజా తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News