Saturday, April 20, 2024

శరవేగంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో విస్తరణ పనులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణ పనులు (రెండో విస్తరణ మెట్రో) శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులను వేగవంతం చేయడానికి సమాంతరంగా అనేక ముందస్తు నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభించినట్టు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండి ఎన్‌విఎస్ రెడ్డి పేర్కొన్నారు. జనరల్ కన్సల్టెంట్ (జిసి) కోసం బిడ్‌ల సమర్పణకు ఈ నెల 20 చివరి తేదీ కాగా, ఈ నిపుణులైన ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు వచ్చే నెల మొదటి వారంలో నియమితులవుతారని ఆయన తెలిపారు. ఈలోగా మెట్రో అలైన్‌మెంట్‌ను పక్కాగా సరిదిద్దడానికి, స్టేషన్ల స్థానాలను నిర్ణయించడానికి సర్వే పనులు  ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు.

శాటిలైట్ ఆధారిత డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం, ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ అనే రెండు పద్ధతులు ఉపయోగించి, కచ్చితమైన కో ఆర్డినేట్‌లను తెలుసుకోవడం కోసం సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాంల సాయంతో సర్వే పని జోరుగా జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. శంషాబాద్ పట్టణానికి సమీపంలోని ఫోర్ట్ గ్రాండ్ అండర్‌పాస్ వరకు ఇప్పటివరకు 21 కిలోమీటర్ల మేర సర్వే పూర్తి కాగా ఈ నెలాఖరులోగా మొత్తం సర్వే పూర్తి కానుందని, ఆ తర్వాత అలైన్‌మెంట్ ను తెలియజేసేలా పెగ్ మార్కింగ్ ప్రారంభిస్తామని ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News